కమిటీ ఏర్పడ్డాకే మాట్లాడ్తాం: సర్వే

తెలంగాణకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యుపిఎ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పారు. తామంతా కలిసే ఉన్నామని, తాము పార్టీ పటిష్టతకే పని చేస్తామని, సోనియా నాయకత్వాన్ని బలపరుస్తామని, అందుకు భిన్నంగా వ్యవహరించబోమని, ఈ విషయాన్ని తాము ముక్తకంఠంతో చెబుతున్నామని ఆయన అన్నారు. తాము పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని, ధిక్కరించే వారు కాంగ్రెసు కార్యకర్తలే కారని ఆయన అన్నారు. తెలంగాణ అంశం కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications