వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడ పాపను చంపేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: శనివారం విజయవాడలో అపహరణకు గురైన బిసి నేత పలగాని ప్రభాకర్ కూతురు నాగవైష్ణవిని దారుణంగా హత్య చేశారు. కారులో పాఠశాలకు వెళ్తుండగా దుండగులు కారు డ్రైవర్ లక్ష్మణరావును హత్య చేసి నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు. ఈ సమయంలో దుండగుల నుంచి ప్రభాకర్ కుమారుడు తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు నాగవైష్ణవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నాగవైష్ణవిని పోలీసులు కాపాడలేకపోయారు. బంధువులే నాగవైష్ణవి పట్ల యమకింకరులయ్యారు. ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడు వెంకట్రావును ఈ కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. జగదీష్, శ్రీనివాస్ అనే ఇద్దరితో కలిసి అతను ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లాలోని ఇనుమును కరిగించే బాయిలర్ లో వేసి వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో వైష్ణవి దేహాన్ని కాల్చేశారు. పాఠశాలకు నవ్వుతూ వెళ్లిన వైష్ణవి బూడిదకప్పై సోమవారం సాయంత్రం దర్శనమిచ్చింది. తన కూతురు క్షేమంగా తిరిగి వస్తుందని భావించిన తండ్రి ప్రభాకర్ ఆమె మరణ వార్త విని గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. హంతకులు వైష్ణవి చంపడమే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన గంటన్నర లోపే ఆమె ప్రాణాలు తీసినట్లు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని బాయిలర్లో వేసినట్లు అనుమానిస్తున్నారు. తనకు శత్రువులు ఎవరూ లేరని ప్రభాకర్ చెబుతూ వచ్చారు. అయితే ప్రభాకర్ ను పోలీసు కమిషనర్ రాజేంద్ర రెడ్డి విచారించారు. ఆ విచారణలో కొన్ని విషయాలు తెలిసి కుటుంబ కలహాల దిశగా దర్యాప్తు చేపట్టారు. దాంతో కేసు చిక్కుముడి విడదీసే ప్రయత్నం చేశారు. కానీ పాపను మాత్రం రక్షించలేకపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X