వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కమిటీపై చంద్రబాబు నో కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఏలూరు: రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై వ్యాఖ్యానించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరస్కరించారు. బుధవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండు కళ్ల లాంటివని, రెండు ప్రాంతాల ప్రజల మనోభావాలను తాను గౌరవిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ అంశం చాలా సున్నితమైంది, జఠిలమైందని ఆయన అన్నారు.

తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుగు ప్రజల అభివృద్ధి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ తమ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పార్టీలు రెండు చీలిపోయినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X