వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు మాట తప్పదు: డి శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీని ఆయన ఆహ్వానించారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమస్యను పొడగించకుండా త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసిందని ఆయన అన్నారు.

కమిటీ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నేతల అభిప్రాయాలను తీసుకుంటుందని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు నాయకత్వం చిత్తశుద్ధితో ఉందనడానికి కమిటీ వేయడం మరో రుజువు అని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X