వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధివిధానాలు చూశాకే మాట్లాడ్తాం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

JAC
హైదరాబాద్: కమిటీ విధివిధానాలు చూసిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీపై మాట్లాడ్తామని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. తమ జెఎసిలో చర్చించిన తర్వాత తాము మాట్లాడుతామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బుధవారం రెండు గంటలకు జెఎసి సమావేశమవుతుందని ఆయన అన్నారు.

రాష్ట్ర పరిస్థితులపై సమీక్షకు వేసిన కమిటీ పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా, వద్దా అనే విషయంపై కమిటీ వేస్తే సహించబోమని ఆయన బుధవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మాత్రమే కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. హోం శాఖ నుంచి పూర్తి స్థాయి ప్రకటన అధికారికంగా రావాల్సి ఉందని, అది వచ్చిన తర్వాత తమ అభిప్రాయాలు చెప్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X