17 మంది సారా మృతులకు పరిహారంపై సిఎం మౌనం

Bosta Satyanarayana
రాజమండ్రి: 'అంబాజీపేట మండలం గంగల కుర్రు అగ్రహారం కేంద్రంగా గత నెల 23న మిథైల్‌ ఆల్కహాల్‌ కలిపిన నాటు సారా సేవించిన వారు ఇప్పటి వరకూ 17మంది మృతి చెందారు. 20మంది తీవ్ర అస్వస్థతతో ఉన్నారు. 274 మంది అనారోగ్యానికి గురయ్యార'ని ముఖ్యమంత్రి రోశయ్య మంగళవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రక టించారు. ఇప్పటికే ఈ కేసులో ఎని మిది మందిని అరెస్టు చేయగా బాధ్యులుగా ఎక్సైజ్‌ అధికారులు కొందరిని సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. సంఘటన పూర్వాపరాలను జిల్లా మంత్రులు విశ్వరూప్‌, బోస్‌లతోపాటు ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ తన దృష్టికి తెచ్చినట్టు రోశయ్య చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం బియ్యపుతిప్ప దగ్గర జరిగిన పడవ ప్రమాదం, విశాఖ దగ్గర పుట్టి మునిగిన దుర్ఘటనలో మృతులకు ఆపద్బంధు కింద రూ50 వేలు, సీఎం సహాయ నిధి నుంచి రూ50 వేలు వెరసి రూ.లక్ష వంతున మృతులకు సహాయంగా రోశయ్య ప్రకటించారు. కల్తీసారా తాగి మరణించిన వారి కుటుంబాలకు మాత్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించ లేదు. మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రకటిస్తారని ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఇటీవల వచ్చినప్పుడు వెల్లడించారు. కారణాలు ఏమైనప్పటికీ కల్తీసారా దుర్ఘటన మృతులకు ప్రభుత్వం తరపున అంత్యక్రియల కోసం రూ. 5 వేలు, రూ.150 విలువైన నిత్యావసర వస్తువు లను మాత్రమే అందించారు.

ప్రజారాజ్యం పార్టీ మృతుల కుటుం బాలకు రూ.10 వేలు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించారు. సబ్సిడీపై పాడి గేదెలు అందిస్తామన్న జిల్లా అధికారుల ప్రకటన అమలుకు మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ముఖ్య మంత్రి ప్రకటించలేదన్న విషయంపై జిల్లాకు చెందిన మంత్రి పినిపే విశ్వ రూప్‌ను 'ఆన్‌లైన్‌' ప్రశ్నించినప్పుడు బాధితులకు మరింత సాయం అందేలా కృషి చేస్తున్నామన్నారు. పడవల ప్రమాదంలో మృతులకు రూ.లక్ష సహాయంగా ప్రభుత్వం ప్రకటించిం దని, కల్తీసారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి తాము ప్రయత్నం చేస్తున్నామని విశ్వరూప్‌ ప్రకటించారు.

కల్తీసారా మృతి సంఘటనపై పూర్తిస్థాయి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం సహాయం ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. కల్తీసారా మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించడానికి నిబంధనలు అడ్డువస్తాయని మరోకారణంగా చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ బడుగు, బలహీనవర్గాలకు చెందిన 17 మంది కల్తీసారా దుర్ఘటనలో మరణించగా వందల మంది అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితికి చేరుతున్నా ప్రభుత్వం మాత్రం సహాయం అందించడంలో చేస్తున్న సాయం ఆ కుటుంబాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+