తెలంగాణ కమిటీని ప్రకటించిన ప్రభుత్వం

Telangana
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కేంద్రం కమిటీని ప్రకటించింది. ఈ కమిటీకి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వం వహిస్తారు. ఐదుగురు సభ్యులతో కేంద్ర హోం శాఖ ఈ కమిటీని బుధవారం ఉదయం పది గంటలకు ప్రకటించింది. ఈ కమిటీలో ముగ్గురు ప్రొఫెసర్లుంటారు. హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్ దుగ్గల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ప్రొఫెసర్ రణబీర్ సింగ్ (నేషనల్ లా యూనివర్శిటీ), అబు సలే షరీఫ్ (ఐఎఫ్ పిఆర్ఐ), రవీందర్ కౌర్ (ఢిల్లీ ఐఐటి) సభ్యులుగా వ్యవహరిస్తారు.

శ్రీకృష్ణ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటుంది. నెలలోగా ఈ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ కమిటీకి ఆరు నెలల కాల పరిమితిని విధించే అవకాశాలున్నాయి. ఇంకా విధివిధానాలు వెల్లడి కావాల్సి ఉంది. ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పనిచేస్తుందా, రాష్ట్ర విభజన అవసరమా, కాగా అనే విషయాన్ని వెల్లడి కావడం లేదు. త్వరలోనే శ్రీకృష్ణ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. విధివిధానాలను కూడా కమిటీ చైర్మన్ శ్రీకృష్ణ ప్రకటిస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+