తెలంగాణ ఏర్పాటుకే కమిటీ: కేశవరావు

Kesava Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. మరో సీనియర్ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిటీపై అపోహలు అక్కర లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును రాష్ట్ర విభజనగా మాట్లాడవద్దని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంటే పాత హైదరాబాద్ రాష్టాన్ని పునరుద్ధరించడమేనని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు యాభై ఏళ్లు ఆగినవారు మరో ఒకటి రెండేళ్లు ఆగలేరా అని ఆయన అడిగారు. కమిటీకి కాల పరిమితి, విధివిధానాలు ఉండాలని మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో అయోమయం తొలగిపోయిందని మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కమిటీ విధివిధానాలు, కాలపరిమితి త్వరలో ఖరారవుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 5వ తేదీ అఖిల పక్ష సమావేశానికి కొనసాగింపుగానే ఈ కమిటీ పని చేస్తుందని ఆయన అన్నారు. ఈ కమిటీ ఇరు ప్రాంతాల వారికి ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల కోసం పనిచేయదని, ఆంధ్రప్రదేశ్ కోసమే పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ కావాలా, వద్దా కమిటీ వేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే ఈ కమిటీ వేశారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. సమగ్రత, వ్యక్తితం ఉన్నవారితో కమిటీ ఏర్పాటైందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, వివేక్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+