వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయు సంఘటనలు: పోలీసులపై మళ్ళీ హైకోర్టు ఆగ్రహం

By Santaram
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించి నగర జాయింట్‌ కమిషనర్‌ రామాంజనేయులు గురువారం ధర్మాసనం ముందు హాజరు అయ్యారు. ఓయూలో పోలీసు బలగాల మోహరింపుపై ధర్మాసనం ఆయన్ని ప్రశ్నించింది.

ఎవరి అనుమతితో క్యాంపస్‌లో పోలీసు బలగాలను తీసుకు వెళ్లారని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. పాత్రికేయుల వాహనాలను కాల్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంది. మహిళా విద్యార్థులను విచక్షణారహితంగా లాఠీఛార్జ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందని కమిషనర్‌ను నిలదీసింది. ఓయూలో ఆయన తీరును హైకోర్టు తీవ్రంగా గర్హించింది. కేసుల విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో వివరణ ఇవ్వవలసిందిగా ఆదేశించింది.

కాగా ఓయూ ఘటనల వివరాలను అందచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాలను మార్చి 1వ తేదీ కల్లా అందచేస్తామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలియచేశారు. దాంతో కేసుల విచారణను హైకోర్టు మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X