వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలపై ఆ ఇద్దరూ వెనక్కి..

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
న్యూఢిల్లీ: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసిన కాంగ్రెసు శాసనసభ్యులు ఆర్ దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డి వెనక్కి తగ్గే అవకాశం ఉంది. తెలంగాణ జెఎసి నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులతో పాటు వీరిద్దరు కూడా రాజీనామాలు చేశారు. తెరాస శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించారు. అయితే వీరిద్దరి రాజీనామాలను మాత్రం ఆమోదించలేదు. వారిద్దరిని పార్టీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. వారిద్దరితో అధిష్టానానికి చెందిన నాయకులు విస్తృతంగా చర్చలు జరిపారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పారు. దాంతో వారిద్దరు రాజీనామాలు ఉపసంహరించుకోవడానికి సిద్ధపడ్డారు. రేపు శనివారం వారు తమ రాజీనామాలను ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

తమకు అధిష్టానం నుంచి సంతృప్తికరమైన సమాధానం లభించిందని దామోదర్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పిందని, అందువల్ల తాము రాజీనామాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నామని ముత్యం రెడ్డి చెప్పారు. విద్యార్థులు ఆందోళన విరమించి చదువులపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. దామోదర్ రెడ్డి, ముత్యం రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తోనూ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతోనూ సమావేశమయ్యారు. మరో నాయకుడు దిగ్విజయ్ సింగ్ తోనూ వారు సమావేశం కాబోతున్నారు. తమ చర్చలు సఫలమయ్యాయని దామోదర్ రెడ్డి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X