వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో ప్రమాదం, ఐదు దుకాణాలు దగ్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: తిరుమలలో ప్రాణాపాయం తప్పింది. తిరుమలలోని ఒక దుకాణ సముదాయంలో ఆది వారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఐదు దుకాణాలు దగ్ధయ్యాయి. దుకాణంలో పని చేస్తున్న ఇద్దరు గుమాస్తాలు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్నారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. స్థానిక దుకాణ సముదాయం (షాపింగ్‌ కాంప్లెక్స్‌)లోని 58వ దుకాణం ముందు అమర్చిన ట్యూబ్‌లైట్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటలకు విద్యుత్‌ షార్టు సర్య్కూట్‌ అయింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల వేడికి దుకాణంలో నిద్రిస్తున్న గుమస్తాలు మోహన్‌కృష్ణ, రమేష్‌ తేరుకుని హాహాకారాలు చేస్తూ షాపు నుంచి బయటపడ్డారు.

తరువాత పక్కనే ఉన్న 57వ దుకాణానికి మంటలు వ్యాపిం చాయి. ప్రమాదం సమాచారంతో 15 నిమిషాలకు అగ్నిమాపక యంత్రం సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే మంటలు పక్క దుకాణాల వైపు ఎగిసిపడ్డాయి. అయితే 56, 59వ దుకాణాలకు షట్టర్‌ (ఇనుపరేకుల తలుపు) వేసి ఉండడం వల్ల మంటలు వ్యాపించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. 55, 60, 61 దుకాణాలు పాక్షికంగా కాలాయి. పది నిమిషాల వ్యవధిలో అగ్నిమాపకదళం మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసింది. ఈ ప్రమాదంలో మది అనే వ్యక్తికి చెందిన 58వ దుకాణం, శీనుకు చెందిన 57వ నెంబరు బొమ్మల దుకాణం పూర్తిగా కాలిపోయాయి.

దుకాణదారులు అధిక విద్యుత్‌ వాడకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్‌ ఆదికేశవులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆయన ఉదయం 10 గంటలకు సందర్శించారు. 200 వాట్స్‌ విద్యుత్‌ను వాడాల్సిన స్టాల్స్‌లో 2000 వాట్స్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని, దుకాణదారులు కూడా బాధ్యతగా గట్టి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దుకాణాల్లో అధిక సరుకులు కూడా ఉంచుకోవద్దని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X