తిరుమలలో ప్రమాదం, ఐదు దుకాణాలు దగ్ధం
తరువాత పక్కనే ఉన్న 57వ దుకాణానికి మంటలు వ్యాపిం చాయి. ప్రమాదం సమాచారంతో 15 నిమిషాలకు అగ్నిమాపక యంత్రం సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటికే మంటలు పక్క దుకాణాల వైపు ఎగిసిపడ్డాయి. అయితే 56, 59వ దుకాణాలకు షట్టర్ (ఇనుపరేకుల తలుపు) వేసి ఉండడం వల్ల మంటలు వ్యాపించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. 55, 60, 61 దుకాణాలు పాక్షికంగా కాలాయి. పది నిమిషాల వ్యవధిలో అగ్నిమాపకదళం మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసింది. ఈ ప్రమాదంలో మది అనే వ్యక్తికి చెందిన 58వ దుకాణం, శీనుకు చెందిన 57వ నెంబరు బొమ్మల దుకాణం పూర్తిగా కాలిపోయాయి.
దుకాణదారులు అధిక విద్యుత్ వాడకం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని టీటీడీ చైర్మన్ ఆదికేశవులు తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆయన ఉదయం 10 గంటలకు సందర్శించారు. 200 వాట్స్ విద్యుత్ను వాడాల్సిన స్టాల్స్లో 2000 వాట్స్ విద్యుత్ను వినియోగిస్తున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని, దుకాణదారులు కూడా బాధ్యతగా గట్టి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. దుకాణాల్లో అధిక సరుకులు కూడా ఉంచుకోవద్దని ఆయన హెచ్చరించారు.