వైయస్ పేరుతో చీఫ్ ఇంజినీర్ల నిర్బంధం

YS Rajasekhar Reddy
చాగలమర్రి: చాగలమర్రి మండలం రాజోలి ఆనకట్ట వద్ద సాగునీటి శాఖకు చెందిన ముగ్గురు చీఫ్‌ ఇంజినీర్లను కడప జిల్లా రైతులు ఆదివారం నిర్బంధించారు. చీఫ్‌ ఇంజినీర్‌ మసూద్‌ ఆలం, డిజైన్స్‌ సీఈ ఐఎస్‌ఎన్‌ రాజు, మైనర్‌ ఇరిగేషన్‌ సీఈ సీతారామయ్య, ఎస్‌ఈ కిషన్‌ రావు రాజోలి ఆనకట్టను ఆదివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా కేసీ కాలువ ప్రాజెక్టు అధ్యక్షుడు డీఎల్‌ శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వివిధ నీటి సంఘాల అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, రైతులు కలిసి వంద ల సంఖ్యలో రాజోలి ఆనకట్ట వద్దకు తరలివచ్చారు. జననేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలకు విరుద్ధంగా రిజర్వాయర్‌ నిర్మాణం తలపెట్టారని గంటకుపైగా చీఫ్‌ ఇంజినీర్లను నిర్బం«ధించారు.

వారి వాహనాలకు అడ్డంగా రోడ్డుపైనే బైఠాయించారు. రైతులంతా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇంజినీరింగ్‌ అధికారులు కారు నుండి బయటకు కూడా రాలేకపోయారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ రాజోలి ఆనకట్ట వద్ద 3 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్‌ను నిర్మించాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ పనులు పూర్తయితే దువ్వూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు ప్రాంతాల్లోని రైతుల పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+