వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశాంతంగా ఉద్యమం: ఒయు జెఎసి

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania Arts College
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ఇక నుంచి శాంతియుతంగా ఉద్యమం చేస్తామని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) సోమవారం తెలిపింది. ఆత్మహత్యలకు పాల్పడకుండా, బంద్‌లకు స్వస్తిచెప్పి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉద్యమాన్ని నడుపుతామని విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. విద్యార్ధుల ఆత్మహత్యలకు ప్రజాప్రతినిధులే బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. కాగా, మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థుల మధ్య సోమవారం ఘర్షణ చోటు చేసుకుంది. పరీక్షల విషయంలో విభేదాలు తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో పర్సపరం దాడులకు పాల్పడి హాస్టల్ లో విధ్వంసం సృష్టించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25 తేదీల్లో సింగరేణి బంద్ కు కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) పిలుపునిచ్చింది. పార్లమెంటులో వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని జెఎసి డిమాండ్ చేసింది. సింగరేణి బంద్ 48 గంటలు కొనసాగుతుంది. సింగరేణి బంద్ కు తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ మద్దతు ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X