వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్ జిల్లాలో యాదయ్య మృతి ప్రతిధ్వనులు
కరుణాపురంలో హైదరాబాద్, వరంగల్ ప్రధాన రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తొలుత హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ సింగరాజుపల్లి, దేవరుప్పులలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కడవెండిలో దొడ్డికొమురయ్య స్మారక స్థూపం వద్ద తెలంగాణ ద్రోహుల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
Story first published: Monday, February 22, 2010, 9:20 [IST]