వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒయు లాఠీచార్జీపై దద్దరిల్లిన అసెంబ్లీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై మంగళవారం శాసనసభ దద్దరిల్లింది. యూరియా కొరత, ధరల పెంపుపై సిపిఎం, చీరాల శాసనసభ్యుడు కృష్ణమోహన్ సెటిల్ మెంట్ వ్యవహారంపై సిపిఐ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీచార్జీ, యాదయ్య ఆత్మహత్య, ఢిల్లీలో లాయర్లపై వాటర్ కానన్ల ప్రయోగంపై తెలుగుదేశం, బిజెపి, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ప్రజారాజ్యం పార్టీలు వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే వాటిపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ స్థితిలో స్పీకర్ తొలుత సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సద్దుమణగలేదు. తెలంగాణలో విద్యార్థుల బలిదానాలపై, ఒయులో లాఠీచార్జీపై, ఢిల్లీలో లాయర్లపై వాటర్ కానన్ల ప్రయోగంపై చర్చించి తీరాలని బిజెపి, తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని అసెంబ్లీ తీర్మానం చేయాలని తెలుగుదేశం సభ్యులు, బిజెపి సభ్యుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను రెండో సారి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి 30 నిమిషాల పాటు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X