వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిక ధరలపై పార్లమెంటు వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలపై పార్లమెంటు ఉభయ సభల్లో మంగళవారం దుమారం చెలరేగింది. ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తి కార్యక్రమాలు స్తంభింపజేయడంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి. ధరల పెరుగుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కన్నా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ఎక్కువ అని ప్రభుత్వం అనడంతో లోకసభలో ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. అధిక ధరలపై తక్షణమే చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని బిజెపి పట్టుబట్టింది. ఇతర రూపాల్లో చర్చ ఫలితం ఇవ్వకపోవడంతో తాము వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించదలుచుకున్నట్లు బిజెపి డిప్యూటీ నేత గోపీనాథ్ ముండే పార్లమెంటరీ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

బిజెపి తన పట్టు వీడకపోవడంతో లోకసభను స్పీకర్ మీరా కుమార్ వాయిదా వేశారు. ధరల పెరుగుదలపై రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొంది. అధిక ధరలపై 167 నిబంధన కింద చర్చను చేపట్టాలని బిజెపి పట్టుబట్టింది. బిజెపి తన పట్టు వీడకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో రాజ్యసభ వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X