తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు వద్దు: సిఎం

తెలంగాణ సమస్యను కేంద్రం పరిశీలిస్తోందని, రాష్ట్ర పరిస్థితిపై శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేస్తోందని, ఈ సమయంలో అందరూ సంయమనం పాటించడం అవసరమని ఆయన అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తాను ఏ ఒక్క ప్రాంతానికో చెందినవాడినో కానని, ముఖ్యమంత్రిగా తనకు అన్ని ప్రాంతాలూ సమానమని ఆయన అన్నారు. దయచేసి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయవద్దని ఆయన కోరారు.
ఇది అత్యంత సున్నితమైన సమస్య అని, భావోద్వేగానికి సంబంధించిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉద్వేగంతో విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఉద్వేగంలో ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications