మే నుంచి విశాఖ-దుబాయ్ విమాన సర్వీసులు

భారత్ విమాన ప్రయాణికుల సంఘం ఆహ్వానం మేరకు ఫ్లై దుబాయ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆల్గెయిట్ మార్చిలో విశాఖ రానున్నారు. ఈ సంస్థ భారత్లో విశాఖతోపాటుగా చండీఘర్, కోయంబత్తూరు నగరాలకు విమానాలు నడిపేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ సర్వీసు మొదలైతే విశాఖనుంచి నాలుగు గంటల్లో దుబాయ్ చేరుకోవచ్చు. రానుపోనూ చార్జీల కింద సుమారుగా రూ.12వేలనుంచి 14 వేలు ఖర్చవుతుంది. ఎయిర్బస్-320 విమానాల్లో 140నుంచి 150 సీట్లుంటాయి.
రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి కృషి ఫలితంగానే దుబాయ్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయని విమాన ప్రయాణికుల సంఘాధ్యక్షుడు డి.వరదారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖకు సింగపూర్ సర్వీసుల కోసం కూడా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆ దేశంలోని సిల్క్ ఎయిర్వేస్ ప్రతినిధులు గత ఏడాది సర్వే చేయడం తెలిసిందే. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే విశాఖ నగరం మరో మైలురాయి దాటినట్టే.












Click it and Unblock the Notifications