వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధు యాష్కీ వర్సెస్ లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: ఇరువురు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల మధ్య మాట యుద్ధం సాగింది. తెలంగాణకు చెందిన మధు యాష్కీకి, కోస్తాంధ్రకు చెందిన లగడపాటి రాజగోపాల్ కు మధ్య తీవ్ర వివాదం నడిచింది. కోస్తాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ లపై మధుయాష్కీ తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపారాల కోసం ఆ ముగ్గురు తెలంగాణను అడ్డుకుంటున్నారని, వారి రంగు బయటపెడతానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ ముగ్గురు ప్రభుత్వం నుంచి ఎన్ని వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుందీ తాను వెల్లడిస్తానని ఆయన అన్నారు. ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్ ను వ్యాపార అవసరాలకు వాడుకుంటున్న రాయపాటి, లగడపాటి వంటివారికి నీతులు మాట్లాడే హక్కు లేదని ఆయన అన్నారు.

మధు యాష్కీ ఆరోపణలపై లగడపాటి తీవ్రంగా ప్రతిప్సందించారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం ఆపి వాస్తవాలుంటే బయట పెట్టాలని ఆయన మధు యాష్కీని సవాల్ చేశారు. తమను బ్లాక్ మెయిల్ చేయడం వెనక ఉన్న మతలబు ఏమిటని ఆయన అడిగారు. కెసిఆర్, కోదండరామ్, జయశంకర్ హిట్లర్ లా మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X