అమంచిపై రగడ: అసెంబ్లీ వాయిదా

ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపుపై ప్రజారాజ్యం, సిపిఐ, సిపిఎం, ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ను ఉద్దేశించి ఖమ్మం జిల్లాలో హేతువాది క్రాంతికిరణ్ రాసిన పుస్తకంపై మజ్లీస్ వాయిదా తీర్మానాలను ప్రతిపాదించాయి. కాగా, పుస్తక రచయిత క్రాంతికిరణ్ ను అరెస్టు చేశామని, పుస్తక రచన వెనక ఎవరున్నారనే విషయంపై విచారణ జరుపుతున్నామని, దీనిపై ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య మజ్లీస్ సభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో వారు సద్దుమణిగారు.












Click it and Unblock the Notifications