వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి రోశయ్యతో చిరంజీవి భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కె రోశయ్యతో సమావేశమయ్యారు. ఆయన గురువారం ఉదయం రోశయ్యను కలిశారు. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించాలని చిరంజీవి ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.

మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర ఆ మధ్య కాలంలో అస్వస్థత కారణంగా మరణించారు. చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత ఉపేంద్ర కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరారు. ప్రజారాజ్యంలో ఉంటూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఉపేంద్ర గతంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X