వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కొండవీడు
ఈ సందర్భంగా సత్యగోపీనాథ్దాస్ మా ట్లాడుతూ దేవతామూర్తుల విగ్రహాలు, సనాతన ధర్మాలను తెలిపే దృశ్యాలతో, చారిత్రక ఆధారాలతో మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు. ముందుగా కొండవీడు గ్రామానికి చేరుకుని పురాతన నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. కొండపైకి ఆంజనేయస్వామి విగ్రహాన్ని, వరహాల కొట్టు, నేతి కొట్టు, శివాలయాన్ని, ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్లచెరువును పరిశీలించారు. అనంతరం కోట గ్రామం వైపున ఉన్న మెట్లదారి నుంచి కిందికి దిగి గ్రామంలోని జెండాచెట్టు వద్ద కూర్చుని వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
రెండు ఆలయాల నిర్మాణం..గిరిదుర్గంపై వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అధునాతన రీతిలో నిర్మించనున్నట్లు వారు తెలిపారు. కొండ దిగువున రాధాకృష్ణ ఆలయాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.
Comments
Story first published: Thursday, February 25, 2010, 8:47 [IST]