వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్, కోదండరామ్ లకు పిండ ప్రదానం

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Kodandaram
కడప: టీఆర్‌ఎస్‌ అధినేత కె చంద్రశేఖర రావు, తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదండరామ్‌లకు టీఎన్‌ఎస్‌ఫ్‌ నాయకులు బుధవారం పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కడప కేసీ కాలువ వద్ద వారి పిండాలు ఉంచి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించి కేసీ కెనాల్‌లో వదిలారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ కో-కన్వీనర్‌ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రులు వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రం విడిపోక ముందే రాష్ట్రంలోని వస్తువులను బహిష్కరించాలని పిలుపునివ్వడం దారుణమన్నారు. దీని బట్టి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నట్లు కనబడుతుందని పేర్కొన్నారు.

ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, కోదండరామ్‌ కుటుంబీకులు ఏసీ గదుల్లో సంతోషంగా గడుపుతుంటే, వీరిద్దరూ విద్యార్థులను రెచ్చగొట్టి వారి బతుకులను దుర్భరంగా మారుస్తున్నారని విమర్శించారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న కోదండరామ్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్‌ పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర ప్రజలు, విద్యార్థుల గురించి చెడుగా మాట్లాడడం తగదన్నారు. తెలంగాణ విద్యార్థులే ప్రొఫెసర్‌ కోదండరామ్‌పై దాడులు చేసే సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు నాగేంద్ర, నరసింహులు, వెంకటేశ్‌, రవితేజ, గంగాధర్‌, టీఎన్‌ టీయూసీ జిల్లా కార్యదర్శి కత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X