'భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి'

Praveen Togadia
జగ్గంపేట: భారత్‌ను హిందూదేశంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌తొగాడియా డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం జగ్గంపేటలో జరిగిన ఆత్మీయ సదస్సులో తొగాడియా మాట్లాడుతూ భారత్‌ను హిందూదేశంగానే చూడాలన్నారు. భార త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సంస్కృతికి నిలయమన్నారు. భారతీయులు లెక్కల లో జీరో నుంచి తొమ్మిది వరకు సంఖ్యలను ప్రపంచానికి తెలియజేశారన్నారు. ముస్లింల రిజర్వేషన్లను తగ్గించాలని, ఆంధ్రలో మతం ఆధారంగా రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించడం తగదన్నారు. మధ్యప్రదేశ్‌, ఒరి స్సా రాష్ట్రాల మాదిరిగా మతమార్పిడి నిరోధక చట్టాలను అమలు చేయాలన్నారు. దేశంలో హిందువులు 2.2శాతం చొప్పున పెరుగుతుంటే, ముస్లిం జనాభా 3.4 శాతం చొప్పున పెరుగుతోందని చెప్పారు.

రాబోయే 30, 40 ఏళ్లలో ముస్లిం జనాభా 30శాతం పెరిగే అవకాశం ఉండడంతో దేశవిభజన జరిగే అవకాశం ఉందన్నారు. గోమాతకు తొగాడియా పూజలు విశ్వహిందూపరిషత్‌ అంతర్జాతీయ కార్యదర్శి ప్రవీణ్‌తొగాడియా బుధవారం ఉదయం భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు. దగ్గరలోని గోమాత, దూడకు పచ్చగడ్డి, గోధుమ రొట్టెలు తినిపించి పూలమాలలు వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా గోలి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పలువురు తొగాడియాను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి సుధాన్షీపట్నాయక్‌, పూర్వాంధ్ర కార్యదర్శి ఎం.హనుమంతరావు, ప్రాంత ఉపాధ్యక్షుడు ఒబిలిశెట్టి శ్రీవెంటేశులు, ప్రాంత సంఘటన కార్యదర్శి జె.భాస్కర్‌, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు మేకా సుబ్బారావు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాల కొండయ్య, ఆర్‌ ఎస్‌ ఎస్‌ కు నేతలు పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి జగ్గంపేటలో తొగాడియాకు ఘనస్వాగతం లభించింది. స్థానిక గోలి సత్యకృష్ణ ఇంట్లో ఆయన బస చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+