పిఎం తెలంగాణ ప్రకటనపై నాగం విసుర్లు
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెసు మరోసారి నడుం బిగించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనపై ఒక అభిప్రాయానికి వస్తే తమ పార్టీ కూడా ఒక అభిప్రాయానికి వస్తుందని ఆయన అన్నారు. చిదంబరం ప్రకటన తర్వాత ప్రాంతాలవారీగా తమ రెండు పార్టీలు విడిపోయాయని, అటువంటప్పుడు ఏకాభిప్రాయం ఎలా సాధిస్తారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీని రాష్ట్ర విభజనకు వేశారా, కలిపి ఉంచడానికి వేశారా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ మన్మోహన్ సింగ్ హైదరాబాద్ nagam janardhan reddy telugudesam telangana manmohan singh hyderabad
Story first published: Saturday, March 6, 2010, 16:28 [IST]