అసెంబ్లీలో కర్నూలు వరదలపై వాగ్వివాదం
అంతకు ముందు చంద్రబాబు కర్నూలు వరదలపై ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. వరదల సమయంలో బాధితులకు ప్రభుత్వం నరకం చూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవ తప్పిదం వల్లనే కర్నూలుకు వరదలు వచ్చాయని ఆయన అన్నారు. శ్రైశీలం నుంచి సకాలంలో కిందికి నీరు వదిలి ఉంటే ప్రమాదాన్ని నివారించి ఉండగలిగేవాళ్లని ఆయన అన్నారు. కర్నూలు ప్రజలను శ్రీశైల మల్లికార్జునుడే కాపాడాడని ఆయన అన్నారు. వరదల వల్ల ప్రజలు బాధపడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు తమాషా చూశారని ఆయన అన్నారు. మంత్రులు వరద తాకిడి ప్రాంతాల్లో కనీసం పర్యటనలు కూడా జరపలేదని ఆయన అన్నారు. వరద బాధితులు తిండి కూడా లేకుండా బాధపడుతుంటే మంత్రులు సంబరాలు చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజలకు నరకాన్ని చూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. వరదలు మానవ తప్పిదం కాదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.