హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మను చూడడానికే వచ్చా: బాలకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: అమ్మను చూడడానికే తాను వచ్చినట్లు ప్రముఖ నటుడు, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ చెప్పారు. ఆయన బుధవారంనాడు సవతి తల్లి లక్ష్మీపార్వతి ఇంటికి వచ్చాడు. ఇక ముందు కూడా తన తల్లి లక్ష్మీపార్వతి ఇంటికి వస్తుంటానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. అమ్మ ఆప్యాయత, అనురాగాలను పంచుకోవడానికి తాను వచ్చానని ఆయన చెప్పారు. తమ మధ్య అపోహలేమీ లేవని ఆయన అన్నారు. తన కొడుకు తన ఇంటికి వచ్చాడని, అందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. తమ మధ్య విభేదాలు సమసిపోయాయని ఆమె మీడియా ప్రతినిదులతో అన్నారు. తాము అన్ని విషయాలు చర్చించామని బాలకృష్ణ, లక్ష్మీపార్వతి చెప్పారు.

అనూహ్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తన సవతి తల్లి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతితో భేటీ అయ్యారు. బాలకృష్ణ లక్ష్మీపార్వతి ఇంటికి వచ్చారు. ఆయనే కారు నడుపుకుంటూ వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ మరణించిన తర్వాత లక్ష్మీపార్వతిని బాలకృష్ణ కలవడం ఇదే తొలిసారి. వారిద్దరి మధ్య దాదాపు గంటపాటు చర్చలు జరిగాయి.

ఆస్తుల వివాదం విషయంలో వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ కు తానే వారసురాలిని అంటూ లక్ష్మీపార్వతి అంటున్నారు. వివాదం కోర్టులో కూడా ఉంది. ఇప్పటికి 14 ఏళ్లు గడిచినప్పటికీ ఏ విధమైన పరిష్కారం రాలేదు. దీంతో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు బాలకృష్ణ సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో ఓ రాజీ ఫార్ములాను బాలకృష్ణ లక్ష్మీపార్వతి ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X