వచ్చే నెలలో లోకసభలో మహిళా బిల్లు

అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెడితో ఆర్థిక బిల్లు ఆమోదానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళన కొందరు అధికార పార్టీ ఎంపీల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీజేపీ, వామపక్షాలు కోత తీర్మానాలకు సిద్ధమయ్యాయి. మహిళా బిల్లుపై సభ్యుల్లో ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు బీజేపీ పరోక్షంగా కుట్ర పన్నిందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
తమ సీట్లు కాపాడుకునేందుకు పలువురు ఎంపీలు బీసీ, ముస్లిం ఎంపీలను రెచ్చగొడుతున్న వాతావరణం సెంట్రల్ హాల్ లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టే సాహసం ప్రభుత్వం నిజాయితీగా చేయకపోచ్చుననని, ఒక వేళ ప్రవేశపెట్టినా, సభ్యుల వ్యతిరేకతను చూసి నాటకీయంగా వెనక్కు తగ్గవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. బిల్లు అమల్లోకి వస్తే 543 మంది సభ్యులుగల లోక్సభలో 181 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. దేశంలోని 28 రాష్ట్రాల అసెంబ్లీల్లో 4109 సీట్లకుగాను 1370 సీట్లలో మహిళలు వస్తారు.












Click it and Unblock the Notifications