రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి జైల్లోని బాత్రూంలో ఖైదీ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari Dist
నెల్లూరు: రాజమండ్రి కేంద్ర కారాగారంలో గురువారం ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కీరపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావు జైలులోని బాత్రూంలో తన చొక్కాతో ఉరేసుకుని మరణించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. భార్య హత్య కేసులో అతను ఈ నెల 3వ తేదీ రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలుకు వచ్చాడు.

జైలుకు వచ్చినప్పటి నుంచి సుబ్బారావు మానసికంగా కృంగిపోయినట్లు కనిపిస్తున్నాడని, ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కూడా చేయించామని జైలు అధికారులు చెబుతున్నారు. బాత్రూంకు వెళ్తానని తమతో చెప్పాడని, దానికి అనుమతించామని, పదిహేను నిమిషాలు గడిచినా తిరిగి రాకపోవడంతో చూశామని, సుబ్బారావు ఉరేసుకుని కనిపించాడని వారంటున్నారు. అతను స్యూసైడ్ నోట్ కూడా రాసి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X