రాట్నం వడికిన టిడిపి చీఫ్ చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యలను ప్రతిబింబించడానికి తెలుగుదేశం, వామపక్షాల శాసనసభ్యులు గురువారం శాసనసభ ఎదురుగా గల గన్ పార్క్ వద్ద ధర్నా చేశారు. రాట్నం వడుకుతూ, మగ్గం నేస్తూ శాసనసభ్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వథకాన్ని వారికి వర్తింపజేసి కనీసం వంద రోజులు వారికి పని కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+