సీమాంధ్ర ఎమ్మెల్యేలకు రోశయ్య బుజ్జగింపు

Rosaiah
హైదరాబాద్: హైదరాబాద్ ను ఫ్రీజోన్ ను నుంచి మినహాయిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశ పెట్టదలచిన తీర్మానానికి ఆదిలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెసులోని సీమాంధ్ర శాసనభ్యులు కూడా తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులను బుజ్జగించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రయత్నిస్తున్నారు. తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించాలని ఆయన సీమాంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులను కోరుతున్నారు. అయితే వారు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది.

తీర్మానంతో సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తమ ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి బుధవారం శాసనసభలో ప్రకటించారు. అంతే కాకుండా అందుకు గాను బుధవారం సాయంత్రం అఖిల పక్ష సమావేశం కూడా నిర్వహించారు. చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించడానికి అఖిల పక్ష సమావేశం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తెల్లారే సరికి పరిస్థితి తారుమారైంది. ఈ గండం నుంచి రోశయ్య ఎలా గట్టెక్కుతారనేది వేచి చూడాల్సిందే.

పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులు ఒక్కటయ్యారు. తీర్మానాన్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు. దీంతో రోశయ్యకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యులే కాకుండా సిపిఎం, సిపిఐ శాసనసభ్యులు కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే తీర్మానం గురువారం శాససనభలోకి వస్తుందా, లేదా అనేది కూడా అనుమానమే. మంచినీటి ఎద్దడిపై గురువారం ఉదయం నుంచే శాసనసభలో గొడవ జరుగుతోంది. ఉదయం పది గంటల వరకే శాసనసభ రెండు సార్లు వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+