తెలంగాణలో జగన్ యాత్ర వద్దు: యాష్కీ

ప్రజా సంఘాలన్నీ ఐక్యంగా పని చేయాలని యాష్కీ సూచించారు. ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మంచిది కాదన్నారు. సీమాంధ్ర తొత్తులని, కలిసి పోరాడడం లేదని, పదవులు, రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారని తెలంగాణ ప్రాంత నేతలను విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు. పదవులు త్యాగం చేసిన వారిని ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, వారి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని తమ పార్టీ అధిష్ఠానాన్ని కోరతానని యాష్కీ తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉందని, ఈ ప్రాంతంలో పర్యటించనున్న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి వాస్తవాలు బోధపడతాయని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications