కరీంనగర్: కరీంనగర్ జిల్లా కోహెడలో మంటలు లేవడంతో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడడంతో అందులో మంటలు లేచినట్లు సమాచారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో కోహెడలో విషాద వాతావరణం నెలకొంది.