విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైష్ణవి హత్య, 60 రోజులు గడిచినా...

By Santaram
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ: చిన్నారి వైష్ణవిని అత్యంత హేయంగా హతమార్చి, కొలిమిలో పడేసి కాల్చిబూడిద చేసిన ఆ విషాద సంఘటన జరిగి 60 రోజులయింది. అందరి హృదయాలను కదిలించిన చిట్టితల్లి నాగ వైష్ణవి స్మృతులు ఇంకా నగరవాసులను వెన్నాడుతున్నాయి. పోలీసులు ఇప్పటికే హత్యోందంతానికి కారకులను అరెస్టు చేసినా శిక్షల అమలు తీరుతెన్నులపై చర్చ నడుస్తోంది. నిందితుడు వెంకట్రావు వైష్ణవి హత్యలో తన ప్రమేయం లేదని న్యాయవాది ద్వారా విన్నవించారు. అగ్ని పరీక్షకైనా సిద్ధమే.. అంటూ ప్రకటించారు. నాగ వైష్ణవి తల్లి నర్మదాదేవి వెంకట్రావు నుంచి ప్రాణహాని ఉందని, ఇప్పటికే మొరపెట్టుకోవడంతో పోలీసులు ఆ కుటుంబానికి రక్షణ కల్పిస్తున్నారు. షిఫ్టుల వారీగా ప్రభాకర్‌ ఇంటి దగ్గర బందోబస్తు కొనసాగుతోంది.

నార్కో అనాలిసిస్‌ పరీక్షలకు విముఖత చూపిన వెంకట్రావు సోమవారం అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. నార్కో పరీక్షల నిర్వహణకు సంబంధించి పోలీసుల దాఖలు చేసిన పిటిషన్‌లో తన వాదనను వినాలని కోరారు. సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు రావడంతో వెంకట్రావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వైష్ణవి కేసులో వెంకట్రావు ప్రమేయం ఎంత మాత్రం లేదని అతని న్యాయవాదులు వాదించారు.

ఇప్పటి వరకు కోర్టులో నిందితులని హాజరుపరచడం, నిందితుల గుర్తింపు ప్రక్రియ జరిగింది మినహా కేసు అసలు విచారణ మొదలైంది లేదు. పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జీషీట్‌ దాఖలు చేయాలి. లేదంటే కేసులో నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక 60 రోజులు పూర్తికాగా, ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలు కీలకమైనందున నివేదికలు హైదరాబాద్‌ నుంచి అందాలి. నార్కో అనాలిసిస్‌ పరీక్షలు జరిగితే తదనుగుణంగా ఛార్జీషీట్‌లో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ పూర్తయితేనే కోర్టులో నాగ వైష్ణవి కేసు విచారణ మొదలుకాదు. నెల రోజుల సమయంలోను పోలీసులు పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X