ఎకె ఖాన్ అంటే మజ్లీస్ కు పడదా?
ఎకె ఖాన్ చొరవతో సిపిఎం, సిపిఐ పాతబస్తీలో తమ రాజకీయ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. సిపిఎం రాజ్యసభ సభ్యుడు మధును పాతబస్తీ రాజకీయ బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలో మజ్లీస్ కు, సిపిఎంకు మధ్య పలు వివాదాలు కూడా చెలరేగాయి. మజ్లీస్, బిజెపిల రాజకీయాలకు చెక్ పెట్టేందుకు పన్నిన ఖాన్ వ్యూహం మజ్లీస్ నేతలకు కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో మజ్లీస్ నేతలు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఖాన్ బదిలీ చేయించారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ కమిషనర్ గా రావడంతో మజ్లీస్ కు మింగుడు పడడం లేదని అంటున్నారు.
Comments
Story first published: Saturday, April 3, 2010, 10:23 [IST]