చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం చిత్తూరు పర్యటనలో అపశృతులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
చిత్తూరు: ముఖ్యమంత్రి కె. రోశయ్య చిత్తూరు పర్యటనలో అపశృతులు చోటు చేసుకున్నాయి. శనివారం ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు. రోశయ్య పర్యటన సందర్భంగా ఓ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కాగా, ముఖ్యమంత్రి సభకు వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

కాగా, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ధర్నాకు దిగారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరడానికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి తెలుగుదేశం శాసనసభ్యులు చేరుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు చర్యను నిరిసిస్తూ వారు ధర్నాకు దిగారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం జిల్లా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X