తెరాసది మతిలేని వాదన: లగడపాటి
అది తెరాస నేతల్లో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తోందని అన్నారు. 1956 నవంబర్ 1వ తేదీకి ముందున్న పరిస్థితి అంటే పూర్వ హైదరాబాద్ రాష్ట్రాన్ని కోరుకోవడమేనని ఆయన అన్నారు. అందులో తెలంగాణ జిల్లాలతో పాటు ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఉన్న మరో 8జిల్లాలు కూడా ఉండేవని చెప్పారు. దీన్నిబట్టి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల సరిహద్దులను మళ్లీ గుర్తిస్తూ 'రీ-డ్రాయింగ్' చేయాలని తెరాస కోరుకుంటోందని అవగతమవుతోందని పేర్కొన్నారు. కల్పిత ఉద్యమాన్ని ప్రారంభించాక ఇప్పుడు అందుకు కారణాలను తెరాస వెతుక్కుంటోందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జిల్లాలు స్వీయపాలన చేసినట్లు చరిత్రలో దాఖలాలు లేవన్నారు. లేని దాన్ని ఎలా పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. తప్పుడు నివేదికను సమర్పించిన తెరాస వాదనను తోసిపుచ్చాలని ఆయన దుగ్గల్ను కోరారు.
లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు తెలంగాణ విజయవాడ హైదరాబాద్ lagadapati rajagopal congress telangana vijayawada hyderabad
Story first published: Friday, April 9, 2010, 8:40 [IST]