వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ 14వ తేదీన ఢిల్లీ వస్తా: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: తాను మళ్లీ ఈ నెల 14వ తేదీన ఢిల్లీ వస్తానని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఆయన శుక్రవారం కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల గురించి తాను చిదంబరానికి వివరించినట్లు ఆయన భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పాతబస్తీ ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని ఆయన చెప్పారు.

మళ్లీ ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ నెల 15వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తానని ఆయన చెప్పారు. అదే రోజు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను కలిసి వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్ర వేయించుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఆయనకు ఈసారి సోనియా గాంధీ అపాయింట్ మెంటు దొరకలేదు. దీంతో ఆయన తలపెట్టిన మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X