గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రూపుల వల్లే కాంగ్రెసు బతికింది: పిల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
గుంటూరు: గ్రూపు రాజకీయాలకు రాష్ట్ర మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కొత్త భాష్యం చెప్పారు. గ్రూపుల వల్లనే కాంగ్రెసు పార్టీ ఇన్నేల్లు బతకగలిగిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గ్రూపులుంటేనే పార్టీ క్రియాశీలకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఒక గ్రూపుపై మరో గ్రూపు పోటీ పని చేస్తాయని, దాని వల్ల పార్టీ చురుగ్గా ఉంటుందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీలోని గ్రూపుల మధ్య విభేదాలు లేవని, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. ఒక గ్రూపు కన్నా మరో గ్రూపు బాగా చేయాలనే పోటీ తత్వం ఉంటుందని, దాని వల్ల పార్టీ చురుగ్గా ఉంటుందని, ఇది తన అభిప్రాయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X