కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి వలలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్

By Santaram
|
Google Oneindia TeluguNews

Karimnagar Dist
కరీంనగర్‌: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో పెద్ద అవినీతి చేప చిక్కింది. ఎస్సారెస్పీ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ అన్నం నాయుడు నివాసాలపై ఈ ఉదయం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కరీంనగర్‌, శ్రీకాకుళం, హైదరాబాద్‌ జీడిమెట్లలోని నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో పలు కీలక పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలపై ఏసీబీ ఈ దాడులను నిర్వహించింది. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అన్నం నాయుడు తెలుగుదేశం నాయకుడు ఎర్రంనాయుడుకు దూరపు బంధువని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X