వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని కలిసిన శశి ధరూర్

By Santaram
|
Google Oneindia TeluguNews

Shashi Tharoor
న్యూఢిల్లీ: వివాదాల్లో చిక్కుకున్న విదేశాంగ సహాయమంత్రి శశి థరూర్‌ ఆదివారం మధ్యాహ్నం ఫ్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి ఆయన ప్రధానికి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవికి శశి థరూర్‌ రాజీనామా చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.

కొచ్చి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న థరూర్‌ను మంత్రివర్గంలో కొనసాగించడమా, లేదా అనే అంశంపై ఈ సాయంత్రం జరిగే కోర్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఉద్వాసనో, రాజీనామానో రెండింటిలో ఏదో ఒకటి ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన ప్రధానితో శనివారం సాయంత్రం సోనియా సమావేశమవుతారని, ఆ తర్వాత నిర్ణయం వెలువడుతుందని భావించారు. కానీ సమావేశం వాయిదా పడింది. సోమవారం వారిద్దరి భేటీ ఉండొచ్చని తెలిసింది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని సోనియా ప్రధానికే వదిలేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

ప్రధాని అన్నీ సావధానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ చెప్పారు. ఈ వివాదంపై పార్లమెంట్‌లో చెలరేగిన రగడపై మన్మోహన్‌ పెద్దగా ఆందోళన చెందినట్లు కనిపించలేదు. "రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజమే" అని ప్రత్యేక విమానంలో అన్నారు. థరూర్‌కు ఉద్వాసన ఖాయమని ఇప్పటికీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన చేతే రాజీనామా చేయించాలని అధిష్ఠానం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. శశిథరూర్‌కు ఉద్వాసన పలకాలని భాజపా నేత ఎల్‌.కె.అద్వానీ శనివారం ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X