గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పల్నాడులో ప్రజాపథానికి మావో ముప్పు

By Santaram
|
Google Oneindia TeluguNews

Maoists
గుంటూరు: పల్నాడు ప్రాంతంలో ప్రజాపథం కార్యక్రమానికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి, వెల్దుర్తి, శ్రీనగర్‌, గురజాల నియోజకవర్గం నుంచి దాచేపల్లి, నడికుడి, వినుకొండ నియోజకవర్గంలోని బొల్లా పల్లి, ఈపూరు, సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి అచ్చంపేట, మాదిపాడు, పులిచింతల, నరసరావుపేట నియోజకవర్గం నుంచి రొంపిచర్ల, నకరికల్లు మండలాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రజాపథం ప్రజాప్రతినిధులు, అధికారులకు కత్తిమీద సాముగా మారింది. ఈ పరిస్థితులను అంచనా వేసి కలెక్టర్‌ బి.రామాంజనేయులు, ఎస్పీబాగ్చిలు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు.

నల్లమల్ల ఇన్ ‌చార్జిగా ఇటీవల నియమితులైనట్లు భావిస్తున్న కేంద్రకమిటీ సభ్యుడు ఆర్‌కే సొంతూరు గుత్తికొండ కావడంతో ఈ ప్రాంతాలపై తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో నిర్వహించే ప్రజాప«థం లో పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు తమ అనుమతి లేకుండా వెళ్ళవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జిల్లా ఉన్నతాధికారులు కూంబింగ్‌ ఫోర్స్‌తో పాటు, ఇన్‌ఫార్మర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఎస్పీ బాగ్చి నేతృత్వంలో మావోప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా మార్గదర్శకాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాప«థంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపే పరిస్థితి ఉండదని స్థానిక నాయకులు అభిప్రాయం వ్యక్తంచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X