హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై రోశయ్య ఆగ్రహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆగ్రహాన్ని ఆయన మంత్రులు వట్టి వసంత కుమార్, పితాని సత్యనారాయణ వద్ద వ్యక్తం చేశారు. మళ్లీ స్వర్ణయుగం వస్తుంది, వైయస్ పాలన వస్తుంది అని ఎంపీ జగన్మోహన్‌ రెడ్డి అనడంపై రోశయ్య మండిపడ్డారు. ఇప్పుడు రాక్షస పాలన నడుస్తోందా, జగన్ ఆ మాటలంటే మీరు ఎందుకు ఖండించలేదని ఆయన నిలదీశారు. రోశయ్యకు, మంత్రులకు జరిగిన వ్యవహారంపై వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి.

శనివారం సాయంత్రం ప్రజాపథంపై మంత్రులతో సీఎం సమావేశమయ్యారని, అనంతరం వట్టి, పితాని సహా పలువురు మంత్రులు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని, పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులను అడిగారని సమాచారం. ఇప్పుడు కూడా రాష్ట్రంలో వైయస్ ఏర్పాటు చేసిన మంత్రివర్గమే ఉంది కదా, జగన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఖండించాల్సిన బాధ్యత మీపై లేదా ఆయన అన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైయస్ ఉన్నప్పుడు కూడా కొత్త కార్యక్రమాలు చేపట్టలేదని, అందుకే ఇప్పుడు కూడా చేపట్టలేదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X