వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తించాం: అబూ

By Pratap
|
Google Oneindia TeluguNews

Abu Saleh Sharif
మహబూబ్ నగర్: తాము తెలంగాణ సెంటిమెంట్ ను గుర్తించామని శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు అబూ సలే షరీఫ్ అన్నారు. సహ సభ్యురాలు రవీందర్ కౌర్ తో కలిసి ఆయన సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఆకుతోటపల్లి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. తెలంగాణలో వనరులున్నా సాగు నీరు తెలంగాణకు అందడం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై ఓ డాక్యుమెంటరీని నిర్మించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని కూడా ఆయన చెప్పారు.

తమ రాష్ట్ర తొలి పర్యటన సంతృప్తికరంగా ఉందని ఆయన చెప్పారు. వచ్చే మూడు నెలల వ్యవధిలో తెలంగాణలోని పది జిల్లాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని ఆయన అన్నారు. విస్తృత ప్రజాభిప్రాయ సేకరణకే తాము పర్యటన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గడువు కన్నా ముందే తాము నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X