వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ గొప్ప ముఖ్యమంత్రి: రోశయ్య ప్రశంస

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
అనంతపురం: అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తాగునీటి పథకాలకు అధిక ప్రాథాన్యత ఇచ్చారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. జిల్లాలో ఆదివారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు. వైయస్ ఆర్‌ ఆశయాలు సాధించేందుకు అందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఉత్తమ సీఎం అని అన్నారు. హంద్రీనీవా కాలువ పనులను ఆగస్ట్‌లోగా పూర్తిచేస్తామని హామినిచ్చారు.

ఉపాధి అవకాశాలు పెంచేందుకు అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామని తెలిపారు. జిల్లా ప్రజల దాహార్తి తీర్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని అనంత ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. వైయస్ఆర్‌ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని అన్నారు. రాయదుర్గంలో ఆదివారం జరిగిన ప్రజాపథంలో ఆయన మాట్లాడారు.

అనంతపురం ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఆర్‌ పలు పథకాలను చేపట్టారని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. మంచినీటి పథకాల కోసం కేటాయించిన నిధులను సకాలంలో మంజూరు చేసి, ఈ పథకాలు పూర్తయ్యేందుకు కృషిచేయాలని సీఎంను ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X