రాజా కోసం ఢిల్లీ చేరుకున్న కరుణానిధి

ఈ కుంభకోణం వివరాలివి: ద్ర ప్రభుత్వం 2007లో మరికొన్ని కంపెనీలకు కూడా టెలికం సేవల నిర్వహణకు లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అర్హత ఉన్న కంపెనీలను ఆహ్వానించి, పోటీ పెట్టి అధిక ధర ఎవరు ఆఫర్ చేస్తే వారికే స్పెక్ట్రమ్ లైసెన్స్ ఇవ్వాలని సూచించింది.
అయితే ఈ సూచనను తుంగలో తొక్కిన టెలికం మంత్రి రాజా ఎవరు ముందుగా వస్తే వారికే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. పైగా 2001లో తొలివిడత లైసెన్స్ జారీ చేసినప్పుడు వసూలు చేసిన రేట్ల ప్రకారమే స్పెక్ట్రమ్ ఫీజును కూడా వసూలు చేయాలని డాట్ (టెలికం శాఖ)ను ఆదేశించారు. వాస్తవానికి 2001లో దేశవ్యాప్తంగా టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 40 లక్షలు కాగా 2007-08నాటికి ఈ సంఖ్య 35 కోట్లకు చేరింది. టెలికం సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ను రాజా ఏ మాత్రం పట్టించుకోలేదు.
స్పెక్ట్రమ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల్లో రాజాకు సన్నిహితులుగా భావిస్తున్న యూనిటెక్, స్వాన్, లూప్, డాటాకమ్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇందులో యూనిటెక్ ఒక్కటే అరడజను కంపెనీల పేర్లతో లైసెన్స్ల కోసం వేరువేరు సర్కిళ్లలో దరఖాస్తు చేసింది. నిజానికి యూనిటెక్, స్వాన్ ఈ రెండు కంపెనీలకు టెలికం రంగంలో పూర్వానుభవం ఏ మాత్రం లేదు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications