చిరంజీవి బస్సు యాత్ర ప్రారంభం
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్తో పీఆర్పీ అధినేత చిరంజీవి బుధవారం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుడు తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది నుంచి ఆయన ఈ యాత్ర ను ప్రారంభిస్తున్నారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా యాత్రకు సంబంధిం చి మాత్రం చిరంజీవి పర్యటనలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో చిరు యాత్రలో కూడాకొన్ని సవరణ లు చేశారు.
ప్రతీ జిల్లాలోను సుమారు మూడు రోజులపాటు ఈ యాత్ర సాగాల్సి ఉన్నప్పటికి ఆ రెండు జిల్లాల్లోను నాలుగు రోజుల చొప్పున బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా చిరంజీవి ఈనెల 11వ తేదీకి బదులుగా 13వ తేదీన జిల్లాలో బస్సు యాత్రకు దిగుతారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
దీని ప్రకారం మారిన షెడ్యూ లు మేరకు ఈనెల 13వ తేదీన తూర్పుగోదావరి యాత్రను ముగించుకున్న చిరంజీవి అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నాటికి కొవ్వూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ముందుగా ప్రకటించినట్టుగా జంగారెడ్డిగూడెం వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది. అదే రోజు రాత్రి ఆయన అక్కడే బస చేసి మరుసటి రోజైన 14వ తేదీన జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు ప్రయాణిస్తారు. 14వ తేదీ రాత్రి ఏలూరులో బస చేసి 15వ తేదీ మధ్యాహ్నం నుంచి కృష్ణా జిల్లా యాత్రకు బయలుదేరి వెళ్తారు.