కసబ్ కు ఏ శిక్ష వేస్తారో తేలేది కొన్ని గంటల్లో...

ఇన్నాళ్లూ ఎన్నో మలుపులు, మరెన్నో ఆసక్తికర కోణాల గుండా పరుగులు పెట్టిన ఈ ప్రత్యేక విచారణ బుధవారంతో ముగియడంతో 22 ఏళ్ల కసబ్ భవిష్యత్తును ఈ రోజు తేల్చి వేయనుంది. న్యాయస్థానంలో ముందూ వెనకా ఆలోచించకుండా కసబ్ చేసిన నేరాంగీకార ప్రకటన, అతని నేర నిర్థారణలో కీలక భూమిక పోషించిందని, దోషిగా నిలబెట్టిందని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ వెల్లడించారు.
ఈ దాడిలో పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తాయిబా నిర్వహించిన పాత్ర గురించి, పొరుగుదేశం నుంచి అందిన రక్షణ ఉపకరణాల గురించి కసబ్ తన వాంగ్మూలంలో అనేక విషయాలు పేర్కొన్నాడని..అవే దోష నిర్థారణకు ఉపకరించాయని తెలిపారు.
ఈ విషయాలను కసబ్ తనకు తానుగా బయటపెట్టాడని, దీని వెనక ఎవరి ఒత్తిడీ లేదని తహిల్యానీ స్పష్టం చేశారు. పోలీసుల బలవంతం మీదనే తాను ఆ విదంగా ప్రకటించాల్సి వచ్చిందన్న కసబ్ వాదనను ఆయన కొట్టివేశారు. మెజిస్ట్రేట్ చాంబర్లో తన వాంగ్మూలం నమోదు చేసే సమయంలో పోలీసులు కూడా ఉన్నారన్న కసబ్ ఆరోపణను ఆయన తేలిగ్గా కొట్టిపడేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications