జగన్ సాక్షిపై రోశయ్య మండిపాటు

ఫీజుల రీఎంబర్స్ మెంట్, ఉపకారవేతనాల అంశం చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెసు ఎంపీకి చెందిన పత్రికలో వచ్చిన వరుస కథనాలను రోశయ్య ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వార్తల కటింగ్లతో కూడిన కట్టను మంత్రుల ముందుంచారు. అందులో రాసిన కథనాలను మంత్రులకు చదివి వినిపించారు. వాటిని ఖండించాల్సిన బాధ్యత మంత్రులకు లేదా అని ఆయన అడిగారు. తాను ఈ పదవిని కోరుకోలేదని, ఒక దురదృష్టకర సంఘటన నేపథ్యంలో అధిష్ఠానం బాధ్యతలు అప్పగించిందని, అయినా మనకు వ్యతిరేకంగా రాసే వాళ్ళు మనవాళ్ళెలా అవుతారని ఆయన అన్నట్లు సమాచారం. ముగ్గురు మంత్రులు సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నించినా ముఖ్యమంత్రి వినలేదని, వారిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications