వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పరిష్కారం ఎపిలోనే: చిదంబరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశానికి పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌ లోనే తప్ప ఢిల్లీలో లేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో హోంమంత్రిత్వ శాఖ పనితీరుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భావోద్వేగ్వాలతో ముడిపడిన అంశమని, దానికి పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌ లో ఉంది తప్పితే ఢిల్లీలో కాదని ఆయన అన్నారు. అక్కడి 8 పార్టీలు రాజకీయ విజ్ఞత ప్రదర్శించాలని ఆయన సూచించారు. భాజపా శ్రీకృష్ణ కమిటీని బహిష్కరించడం నుంచి వెనక్కి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం రాజ్యసభలో బిజెపి నేత వెంకయ్యనాయుడు శ్రీకృష్ణ కమిటీ అధికారాలు, విలువలను ప్రశ్నించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని నిలదీశారు. హోం మంత్రి చిదంబరం గురువారం సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

నార్కో అనాలసిస్‌ పరీక్షలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామమని హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. నిందితులెవరైనా విచారణ నాగరిక విధానంలో ఉండాలన్నారు. వారి మానవ హక్కులను గౌరవించాలని చెప్పారు. చిత్రహింస నిరోధక బిల్లు-2010పై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చకు హోంమంత్రి సమాధానం ఇస్తూ ఈ మేరకు పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X